Thursday 19 February 2015

దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ 21వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది

దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ 21వ వార్షికోత్సవం ఈ నెల 16వ తారీకున అంబేత్కర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్పెషల్  జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ మురళీ మోహన్ గారు, సిండికేట్ బ్యాంక్ కాకినాడ శాఖ మేనేజర్ శ్రీ విఠల్ రావు గారు, పిడియాట్రీక్ సర్జన్, యూరాలజిస్ట్ మరియూ రంగరాయా మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫేసర్ అయిన డాక్టర్ కళ్యాణ రవి ప్రసాద్ గారు, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ దుర్గాప్రసాద్ గారు, పాఠశాల ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి యం.సీతాదేవిగారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వక్తల ఉపన్యాసాలు విద్యార్థులను ఉత్తేజపరిచేలా, వారి తల్లితండ్రులను ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. విద్యార్థులకు బహుమతి ప్రధానం జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులని విశేషంగా అలరించాయి. పాఠశాల సీనియర్ ఉపాద్యాయులు శ్రీ రమేష్, శ్రీ చక్రవర్తులను ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది.